టొరంటో: కెనడాలోని (Canada) టొరంటోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున టొరంటో సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని ప్యాసింజర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఐదురుగు భారతీయ విద్యార్థులు (Indian students) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని కెనడాలోని భారత రాయబారి అజయ్ బైసారియా వెల్లడించారు. బాధితుల స్నేహితులతో ఎంబసీ అధికారులు టచ్లో ఉన్నారని తెలిపారు. విద్యార్థుల మృతిపై అజయ్ సంతాపం తెలిపారు.
‘కెనడాలో హృదయ విదారక విషాదం: టొరంటో సమీపంలో శనివారం జరిగిన ఆటో ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరు దవాఖానలో ఉన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. టొరంటోలోని భారత బృందం బాధితుల స్నేహితులతో టచ్లో ఉంది’ అని అజయ్ ట్వీట్ చేశారు.
— Ajay Bisaria (@Ajaybis) March 14, 2022
కాగా, మృతులను హర్ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరన్పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్గా గుర్తించామని క్వింటే వెస్ట్ ఒంటారియో ప్రొవిన్సియల్ పోలీసులు తెలిపారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వ్యాన్ శనివారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ట్రాక్టర్ ట్రైలర్ను ఢీకొట్టిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.