బోస్నెక్: బల్గేరియాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. బోస్నెక్ గ్రామసమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఏడు మందిని రక్షించినట్లు తెలుస్తోంది. టర్కీ నుంచి నార్త్ మెసిడోనియాకు బస్సు వెళ్తున్నట్లు తెలిపారు. బస్సుకు మెసిడోనియా నెంబర్ ప్లేట్ ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేశారు. బస్సు ప్రమాద ఘటన గురించి బల్గేరియా అధ్యక్షుడితో మెసిడోనియా ప్రధాని జోరన్ జేవ్ ఫోన్లో మాట్లాడారు.