మాస్కో: సాంకేతిక సమస్యతో ఓ విమానం అడవిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందిన ఘటన సెర్బియాలో జరిగింది. రష్యాకు చెందిన ఎల్-410 అనే చిన్నపాటి ప్యాసింజర్ విమానం ఇర్కుట్స్క్ నుంచి కజాచిన్కోయ్ వెళ్తున్నది. ఈ క్రమంలో సెర్బియాలోని ఓ అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారని అధికారులు తెలిపారు.
మరో పదకొండు మంది విమానంలో చిక్కుకుపోయారని, వారిని రక్షించామన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానం అత్యవసరంగా కిందికి దిగిందని, ఈ క్రమంలో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ నిమిత్తం కమిటీని నియమించామని వెల్లడించారు.