కైరో : ఈజిప్ట్లోని ఫారోల సమాధుల్లో వేల ఏండ్ల నాటి తమిళ శాసనాలు లభ్యమయ్యాయి. ఈ సమాధులు క్రీ.పూ 1600 నాటికి చెందినవి. అంటే సుమారు 3600 ఏండ్ల క్రితం నాటివి. ఇప్పటివరకు తమిళ వ్యాపారులు ఎర్ర సముద్రం ద్వారా బెర్నిస్ లాంటి ఓడరేవులకు మాత్రమే చేరుకున్నట్టు చరిత్రకారులు చెప్పేవారు. అయితే తమిళ వ్యాపారులు కేవలం అక్కడ దిగడం, వ్యాపారం చేయడం, తిరిగి బయలుదేరడం వరకు మాత్రమే పరిమితం కాలేదని తాజాగా బయటపడ్డ శాసనాలు వెల్లడిస్తున్నాయి.
రోమన్ల కాలంలో తమిళ వ్యాపారులు, ఈజిప్ట్ వాసుల మధ్య రెండు వైపులా బంధం కొనసాగినట్టు ఇవి తెలియజేస్తున్నాయి. ఈజిప్ట్లోని రాజుల లోయలో లభ్యమైన ఈ తమిళ బ్రాహ్మి శాసనాలు రెండు వైపులా ఉన్న పురాతన వాణిజ్య సంబంధాలను సూచిస్తున్నాయి. తమిళ వ్యాపారులు తమ కార్యకలాపాలను కేవలం నౌకా నగరాలకే పరిమితం చేయకుండా దేశమంతటా సాగించినట్టు తెలుస్తున్నది.