ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీస్ లైన్స్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో 28 మందికిపైగా మృతి చెందగా.. సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో పేలుడు జరిగినట్లు పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. మసీదులో ఓ వ్యక్తి తనతంట తాను పేల్చుకున్నట్లు భావిస్తున్నారు. తొలి వరుసలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. జోర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు పేలుడు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేవలం అంబులెన్స్లను మాత్రమే అనుమతిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా దెబ్బతిందని.. భవనం కొంత భాగం కుప్పకూలిపోగా ఆ శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
#UPDATE | At least 28 people were killed and 150 were injured at a blast inside a mosque that shook Peshawar’s Police Lines area, reports Pakistan's Dawn News citing Officials
— ANI (@ANI) January 30, 2023