మహబూబ్నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెలు అభివృద్ధి చెందితేనే దే శం అభివృద్ధి చెందుతుందనే భావనతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతిని తీసుకొచ్చి ప్రతి నెలా నిధులను వరదలా పారిస్తున్నారు. ప్రతిపైసా సద్వినియోగం చేసుకుంటూ పల్లెలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామ పంచాయ తీ అభివృద్ధిలో ఉత్తమంగా నిలుస్తున్నది. గ్రా మంలో ప్రభుత్వ పథకాలు 100 శాతం అమలవుతున్నాయి. జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. రూ.12. 50 లక్షలతో వైకుంఠధామం, రూ.6.50 లక్షల తో సెగ్రిగేషన్ షెడ్ పనులు పూర్తి చేశారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మించారు. రోడ్డుపై చుక్క నీరు నిలవకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎల్ఈడీ బల్బుల బిగింపు వంద శాతం పూర్తి అయ్యింది. గ్రామ పంచాయతీ, రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.కోటి వ్య యంతో రెండేండ్లుగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వ నిధులకు తోడు గ్రామస్తులు స్వచ్ఛందంగా నిధులు సమకూరుస్తూ గ్రామాన్ని ఆదర్శంగా మార్చారు.
రాష్ర్టానికే మోడల్గా రైతు వేదిక..
రాష్ట్రంలోనే మోడల్ రైతువేదికను ఉత్తనూరులో నిర్మించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.22 లక్షలకు అదనంగా మరో రూ.40 లక్షలు వె చ్చించి సకల సౌకర్యాలు కల్పించారు. రైతు వేది క ప్రాంగణంలోకి అడుగిడగానే పచ్చిక బయళ్లు, రంగురంగుల పూల మొక్కలు, నాగలితో అరక పట్టిన రైతు, ఎద్దుల బొమ్మలు, బండి ఆకట్టుకుంటున్నాయి. రైతువేదిక వెలుపల డిజిటల్ స్క్రీన్, సంప్రదాయ సాగు నుంచి ఆధునిక సా గు వరకు జరుగుతున్న మార్పులు, కార్తులు, పంటల వివరాలు ఏర్పాటు చేశారు.
అత్యాధునికంగా ఆరోగ్య ఉప కేంద్రం..
ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో ప్రా థమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో పాడుబడిన కేంద్రానికి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు పడకలతో ఆరోగ్య కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
కార్పొరేట్ పాఠశాల..
ప్రైవేట్ పాఠశాలలను తలదన్నేలా కార్పొరేట్ హంగులతో ఉత్తనూరులోని ప్రభుత్వ పాఠశాల కు ఆధునిక వసతులు కల్పించారు. గ్రామంతోపాటు సంకాపురం, ఈడిగోనిపల్లి గ్రామాల వి ద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే ఉద్దేశంతో మూడేండ్లలో రూ.1.20 కోట్ల వ్యయం తో పాఠశాల భవనం నిర్మించారు. ఇన్నోవేషన్ ల్యాబ్, అత్యాధునిక సౌకర్యాలతో గ్రంథాల యం, సైన్స్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్, ప్రతి తరగతి గదికి ఆధునిక బెంచీలు ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రాంగణం పచ్చదనంతో నిం డిపోయింది. అంతర్జాతీయ క్రీడను అందించేందుకు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ కోర్టును చూస్తే ప్రభుత్వ పాఠశాలలో ఉ న్నామా అనే అనుమానం వస్తుంది. కిచెన్ గార్డెన్లోనే వంటకు అవసరమైన తాజా ఆకుకూర లు, కూరగాయలు పండిస్తున్నారు. ఇందుకో సం ఉపాధ్యాయులకు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శిక్షణ అందించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ. 15 లక్షల వ్యయంతో భోజనశాల నిర్మించారు.
చౌటుప్పల్ తరహాలో ప్రకృతి వనం..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ తరహాలో ఉత్తనూరులో పల్లె ప్రకృతి వనం ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ధ న్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం లో అర ఎకరా భూమి కేటాయించారు. ప్రతి ఏ టా స్థానిక నర్సరీలో పెరుగుతున్న మొక్కలతోపాటు రాజమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాం తాల నుంచి మొక్కలను తీసుకొచ్చి నాటడంతోపాటు సంరక్షిస్తున్నారు.
ప్రతి ఏటా బండలాగుడు పోటీలు..
ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల నుంచి పోటీలకు వృషభరాజములు భా రీగా తరలివస్తుంటాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలను తిలకించేందుకు రైతులు భారీగా తరలిస్తుంటారు. బండలాగుడు పోటీలకు ఉత్తనూర్ గ్రామం రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటున్నది.
మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి..
గ్రామ పంచాయతీలో సకల సౌకర్యాల ను కల్పించి, రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ నిధులతోపాటు గ్రామస్తులు, దాతల సహకారంతో గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి భవన నిర్మాణాన్ని అత్యంత నాణ్యతా ప్రమాణాలతో చేపడుతున్నాం.మాజీ జెడ్పీటీసీ తిరుమల్రెడ్డి సహాయ సహకారాలతో గ్రామానికి రాష్ట్రంలోనే రోల్ మోడల్గా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
– సుదర్శనమ్మ, సర్పంచ్, ఉత్తనూర్
ప్రజల సహకారంతోనే గ్రామాభివృద్ధి..
గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రజలు సహకరిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పా టు దాతల సహకారంతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చక్కటి పల్లె ప్రకృతి వనం ఏ ర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వందశాతం ఇంటి పన్ను చెల్లించి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఏ పని చేపట్టినా అంతా వచ్చి సహకరిస్తున్నారు.