గాజా: అల్ జెజిరా(Al Jazeera)లో పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ ఇంజినీర్కు చెందిన 19 మంది కుటుంబసభ్యులు గాజా దాడుల్లో మృతిచెందినట్లు తేలింది. హమాస్పై ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. గాజా బ్యూరోలో మహమ్మద్ అబూ అల్ ఖుమ్సన్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. జబాలియా క్యాంపుపై ఇజ్రాయిల్ దాడి చేయడం వల్ల అతను తన కుటుంబాన్ని కోల్పోయాడు. ఖుమ్సన్కు చెందిన తండ్రి, సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, 8 మంది కోడళ్లు,అల్లులు చనిపోయినవారిలో ఉన్నారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇటీవల అల్ జెజిరాకు చెందిన మరో జర్నలిస్టు కూడా ప్రాణాలు కోల్పోయాడు. జబాలియా క్యాంపులో జరిగిన దాడిలో 47 మంది మరణించారు. ఆ దాడిలో హమాస్ టాప్ కమాండర్ మరణించినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. శరణార్ధి క్యాంపుపై జరిగిన దాడిలో 50 మంది వరకు చనిపోయినట్లు పాలస్తీనా తెలిపింది.