కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ(Karachi) షాపింగ్ మాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతిచెందారు. రషీద్ మిన్నాస్ రోడ్డులో ఉన్న ఆర్జే మాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 8 మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 22 మందిని రక్షించారు. బిల్డింగ్లో నాలుగో ఫ్లోర్ వరకు క్లియర్ చేశారు. అయిదు, ఆరో అంతస్తుల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. తెల్లవారుజామున 6.30 నిమిషాలకు తమకు ప్రమాద సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం మంటల్ని అదుపు చేశారు.