Fast Charging | బీజింగ్: స్మార్ట్ఫోన్లు నిత్య జీవితంలో కీలకంగా మారాయి. వీటి చార్జింగ్ అయిపోతే.. దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి వారి కోసం చైనా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ సరికొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేవలం 5 నిమిషాల్లో స్మార్ట్ఫోన్ను 100 శాతం చార్జింగ్ అయ్యేలా చేసే కొత్త టెక్నాలజీని సిద్ధం చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
300 డబ్ల్యూ (వూక్) చార్జింగ్ సామర్థ్యం కలిగిన టెక్నాలజీని షెన్జెన్లో(ఆగస్టు 13 నుంచి) ప్రారంభమవుతున్న ‘టెక్ ఫెస్టివల్’లో పరిచయం చేయబోతున్నట్టు తెలిసింది. ‘ఫాస్ట్ చార్జింగ్లో రికార్డ్ బ్రేక్ చేయబోతున్నాం’ అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ టెక్నాలజీతో స్మార్ట్ఫోన్ల చార్జింగ్ 0 నుంచి 50శాతం మూడు నిమిషాల్లో, 100శాతం ఐదు నిమిషాల్లో అవుతుందట!