రషద్ హుస్సేన్ను నామినేట్ చేసిన అమెరికా
వాషింగ్టన్, ఆగస్టు 1: అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు అమెరికా తరఫున రాయబారిగా భారతీయ మూలాలున్న రషద్ హుస్సేన్ను ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు ఓ ముస్లిం వ్యక్తిని నామినేట్ చేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి అని వైట్ హౌస్ తెలిపింది. హుస్సేన్ ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రతా మండలిలో ఓ విభాగానికి డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఒబామా హయాంలో ఆయన ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ)కు అమెరికా నుంచి ప్రత్యేక రాయబారిగా పనిచేశారు.