కొండాపూర్, మే 25 : కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ సోమవారం మాదాపూర్ సర్కిల్ అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక స్మశాన వాటికను సందర్శించిన ఆయన అక్కడ నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్తీలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో మదాహపూర్ సర్కిల్ డీసీ బాలకృష్ణ, డీఈ రూపాదేవి, శానిటేషన్ సిబ్బంది కిరణ్, రమేష్, స్థానికులు ఆంజనేయులు సగర, ఆంజనేయులు, అంజయ్య నగర్ కమిటీ అధ్యక్షుడు నరసింహ, సగర, రవి నాయక్, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.