మారేడ్పల్లి, జూలై 8: సికింద్రాబాద్ వైఎంసీఏ హాల్లో ఈనెల 10వ తేదీన స్పెక్జాబ్ డాట్ ఇన్, వైఎంసీఏ సహకారంతో ఉచితంగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఈఓ డాక్టర్ అబ్రహం తెలిపారు. బుధవారం వైఎంసీఏలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…10వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందన్నారు. జాబ్ మేళాకు వచ్చే వారు 3 సెట్ల బయోడేటా పత్రాలతో రావాలని, వివరాలకు 8885073555, 8885410555 నంబర్లను సంప్రదించాలని సూచించారు. క్వారీ, ఎస్బీఐ, అమేజాన్ పే, హెచ్సీఎల్, ఐబీఎం, సాప్ట్పాల్ టెక్నాలజీస్, టీం లీజ్, కొలెబ్రా లాంటి మొత్తం 20 సంస్థలు ఈ మేళాలో పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో కవి జాన్సన్, విజయ్ కుమార్, జావీద్, కార్తిక్, ఈశ్వర్, హిమబిందు, శ్రావణి పాల్గొన్నారు