ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 18 : డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టి) సౌజన్యంతో ఉస్మానియా యూనివర్సిటీలోని పర్యావరణ శాస్త్ర విభాగం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న సినర్జిటిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యుటిలైజింగ్ ది సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (స్తుతి)-2023 వర్క్షాప్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. వీరయ్య, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్, యుజిసి డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి, వర్క్ షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. శైలజ, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి.రమాదేవి, వృక్ష శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ పి. కమలాకర్, నిట్ వరంగల్ సైంటిఫిక్ ఆఫీసర్ జి.ఎస్.ఆర్. సంజీవని, ప్రొ.సుజాత, ప్రొ.సబిత, డా.నాగేశ్వర్రావు, డా. విజయ్ భాస్కర్, డా.కిరణ్, డా. సాయేద అజీమా, డా.శశికళ, డా.మంచాల లింగస్వామి, కె.సృజన్, బి.భీమ్ రావు పాల్గొన్నారు.