శంషాబాద్ రూరల్ : అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా గురువారం శంషాబాద్ పట్టణంలోని వైఎన్ఆర్ గార్డెన్లో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ మహిళ సాధికారిత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డివో చంద్రకళ, శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మ, నార్సింగి మున్సిపల్ చైర్మన్ రేఖ, వైస్ చైర్మన్ గోపాల్, శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.