దుండిగల్, జూన్ 25: ప్లాస్టిక్ డబ్బా శుభ్రం చేస్తుండగా, పేలుడు సంభవించి.. ఓ మహిళ చనిపోయింది. దుండిగల్ సీఐ రమణారెడ్డి కథనం ప్రకారం…కామారెడ్డి జిల్లాకు చెందిన రుడి లక్ష్మి(27), జయరాం దంపతులు బహదూర్పల్లిలోని ఎస్బీవీకే కన్వెన్షన్లో పనిచేస్తూ..అక్కడే నివాసముంటున్నారు.
శనివారం రాత్రి ఓ మూలన ఉన్న 25 లీటర్ల పాత ప్లాస్టిక్ డబ్బాలో డీజిల్ తీసుకువద్దామని జయరాజ్ బయటకు తీసి పక్కన పెట్టాడు. ఆ డబ్బాను లక్ష్మి శుభ్రం చేస్తుండగా, అది పేలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. విభిన్న కోణాలల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.