చర్లపల్లి (హైదరాబాద్) : ఉప్పల్ నియోజకవర్గంలో తన గెలుపునకు విశేషంగా కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ( MLA Bandari Lakshmareddy ) అన్నారు. ఇటీల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేను చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు . కాలనీల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ముఖ్యంగా కాలనీలలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేమూరి మహేశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, వివిధ కాలనీలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.