హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తేతెలంగాణ): పార్కులు, ఉద్యాన వనాలను సందర్శించే పర్యాటకులకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మృగవని జాతీయ ఉద్యాన వనం (చిలుకూరు), షామీర్పేట జింకల పారును మంగళవారం అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. ఈ రెండు ప్రాంతాల్లో అటవీ భూములు, నర్సరీలు, పునరుద్ధరణ పనులతో పాటు, సందర్శకుల సౌకర్యాలు, జంతువుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఎకో టూరిజం అభివృద్ధికి పలు సూచనలు చేశారు. చిలుకూరు నర్సరీని సందర్శించి, అకడ పెంచుతున్న మొకల రకాలపై ఆరా తీశారు. ఆ తర్వాత శామీర్ పేటలో జింకల పారును అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతాల రక్షణ, ఆక్రమణలకు గురికాకుండా తీసుకున్న చర్యలను పరిశీలించి, రెండు ప్రాంతాల్లోనూ ఆమె మొకలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్, ఎండీ జీ చంద్రశేఖర రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు ఎం.జే.అక్బర్, సునీతా భగవత్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.