మియాపూర్, ఫిబ్రవరి 15 : సీఎం సహాయనిధి పథకం పేదలకు కొండంత అండగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అత్యవసర పరిస్థితులలో పేదల ఆరోగ్యానికి ఆర్థిక అండగను అందిస్తూ ధైర్యాన్నిస్తున్నదన్నారు. మియాపూర్ డివిజన్ జేపీనగర్కు చెందిన హెప్సిబాకు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.లక్ష ఆర్థిక సాయం మంజూరు పత్రాలను విప్ గాంధీ బుధవారం తన నివాసంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విప్ గాంధీ తెలిపారు. ఆపదలో ఆదుకునే సంజీవనిలా సీఎం సహాయనిధి బాధిత ప్రజలకు ఉపయోగపడుతున్నదన్నారు.
డివిజన్ పరిధిలోని మియాపూర్ డివిజన్ హెచ్ంటీ స్వర్ణపురి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎస్ఆర్డబ్ల్యుఏ బ్యాంకు భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ బ్యాంకు నూతన శాఖను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అమీన్పూర్ కౌన్సిలర్ రాజేశ్వరిలతో కలిసి విప్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల సంక్షేమం కోసం బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేసిన సంక్షేమ సంఘం ప్రతినిధులను విప్ గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్, గంగారం, జైపాల్, హెచ్ఎంటీ జీఎం గురుదసాని, డైరెక్టర్లు, సొసైటీ మాజీ కార్యదర్శి పాండురంగారావు, ఎస్బీఐ బ్యాంకు రీజనల్ మేనేజర్ వైవీఎస్ ప్రకాశ్, కాలనీ కార్యదర్శి దేవేందర్రావు, అధ్యక్షులు వెంకటరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
నివారణే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విప్ గాంధీ కోరారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా 12 కేంద్రాలలో కంటి వెలుగు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు, ఉదయం 9 నుంచి 4 గంటల వరకు కేంద్రాలలో సేవలు లభిస్తాయన్నారు.