కాచిగూడ, మే 19: దేశంలోనే హైదరాబాద్ను హెల్త్హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని సుందర్నగర్లో శుక్రవారం బస్తీ దవాఖానను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, స్థానిక కార్పొరేటర్ లావణ్యతో కలిసి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానలను 150 నుంచి 350 వరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అలాగే హైదరాబాద్ జిల్లాకు మరో 14 బస్తీ దవాఖానలను మంజూరు చేసినట్లు తెలిపారు. నిమ్స్ హాస్పిటల్ను 2 వేల పడకల వైద్యశాలగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఎల్బీనగర్, కొత్తపేట, ఎర్రగడ్డ, అల్వాల్ తదితర ప్రాంతాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.వెంకట్, మాజీ ఫ్ల్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, డాక్టర్ దీప్తిపటేల్, బస్తీ దవాఖాన మెడికల్ అఫీనర్ మేమున తదితరులు పాల్గొన్నారు.