చంపాపేట, ఏప్రెల్15 : ఆలయ పాలక మండలి ధర్మకర్తలు ఆలయ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తలుగా ఇటీవల రెండోసారి నియామకమైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మొరిశెట్టి శ్రీనివాస్, సామ రంగారెడ్డి, చేగోని మల్లేశ్ గౌడ్, చాతిరి అఖిలసాగర్, నర్రె శ్రీనివాస్, చలమల యాదిరెడ్డి, దేవరపల్లి వెంకట్రెడ్డి, చొలకరి అనిత, చేగోని అశోక్గౌడ్, ఇమ్మిడి జంగయ్య, సిరిపురం రాజు, బసిగూడెం జంగారెడ్డి, పద్మాల వంకర్, జై శంకర్ ప్రసాద్ శుక్లా శుక్రవారం టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ముడుపు రాజ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువలతో సన్మానం చేసి అభినందించారు.