Ronald Ross | సిటీబ్యూరో: పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సమావేశ మందిరంలో డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్వచ్ఛ భారత్, రాంకీ ప్రతినిధులతో పాటు శానిటేషన్ అడిషనల్ కమిషనర్తో కలిసి పారిశుధ్య నిర్వహణపై సమీక్షించారు. స్వచ్ఛ ఆటో కేటాయించిన ఇండ్లకు రోజు వారీ లక్ష్యం మేరకు సేకరణ పూర్తి చేయాలన్నారు. స్వీపింగ్ యంత్రాలపై నిఘా పెట్టాలని, నిర్దేశించిన సమయం వరకు స్వీపింగ్ చేయించాలన్నారు.
చురుగ్గా పనిచేసే కార్మికులకు బహుమతి అందజేయాలన్నారు. ఉదయం 5.45 గంటల్లోగా జీవీపీ పాయింట్లలో వ్యర్థాల సేకరణ, ప్రధాన రహదారులపై ఉదయం 7 గంటల వరకు శుభ్రం చేసే విధంగా జోనల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 8 గంటలకు డీసీలు, జోనల్ కమిషనర్లు మానిటరింగ్ చేయాలన్నారు.