శంషాబాద్ : ‘పెట్ పేరెంట్స్ కోసం, ఫర్రీ ఫ్రెండ్స్ కోసం..’ హైదరాబాద్లో మొట్టమొదటిసారి శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో పా వాక్ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెట్టింగ్ మ్యాటర్స్, నిగ్గెల్స్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించడం జరిగింది. ఇందులో పెట్ యజమానులు, సోషలైట్స్, జంతు ప్రేమికులు, పెట్ ప్రేమికులు పలువురు పాల్గొన్నారు. శునకాలతో విన్యాసాలు చేయిస్తూ, వాటి యజమానులు, జంతు ప్రేమికులు ఆనందోత్సాహాల మధ్య సంబురాలు పంచారు. వాటిని ఉత్సాహపరిచే పలు వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. రెయిన్ డ్యాన్స్, ఫర్రీలిసియస్, పిక్నిక్ బాక్స్లతో గడపారు. చెఫ్లు రుచికరమైన వంటకాలు అందజేశారు. ఈ సందర్భంగా హోటల్ జనరల్ మేనేజర్ రుబిన్ చెరియన్ మాట్లాడుతూ.. నోవాటెల్ ఆవరణలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ‘పా వాక్’కు అపూర్వ స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ‘పెంపుడు జంతువులపై ప్రేమ, వాటి సంక్షేమంపై పెట్ యజమానులకు అవగాహన’ కల్పించామన్నారు. వారంతా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.