హైదరాబాద్: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 61వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో హైదరాబాద్ నగరానికి చెందిన బాలుడు విశ్రుత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. నగరంలోని నాగోల్ బండ్లగూడ కృష్ణానగర్లో నివాసం ఉంటున్న శేరిపల్లి శివప్రసాద్, మాధవి దంపతుల కుమారుడు విశ్రుత్ 9-11 బాలుర విభాగంలో చెన్నై స్పోర్టిఫై ఎరెనాలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగిన స్పీడ ఇన్లైన్ స్కేటింగ్ పోటీల్లో విశేష ప్రతిభను చాటి ద్వితీయ స్థానంలో నిలిచాడు.
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే విశ్రుత్ గతంలో ఢిల్లీ గురుగామ్లో జరిగిన జాతీయ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించాడు. అదే విధంగా భువనగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విశ్రుత్ రెండు గోల్డ్ మెడళ్లను సాధించి విశేష ప్రతిభ చాటాడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శిక్షణ ఇప్పిస్తే తమ కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతాడని విశ్రుత్ తల్లిదండ్రులు తెలిపారు.