సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఐపీఎల్-2024 మ్యాచ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ నెల 27న సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్కి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంకు వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అవసరమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. టికెట్లు పంపిణీలోనూ ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు. మ్యాచ్ జరిగే రోజు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్బీ డీసీపీ కరుణాకర్, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, ఎస్ఓటీ డీసీపీ నరసింహరెడ్డి తదితర ఏసీపీలు పాల్గొన్నారు.