ఉప్పల్, ఆగస్టు 4 : కాలనీలలో వరద, మురుగునీటి సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టామ ని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారంలో రూ.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న పైపులైన్ పనులను బుధవారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ నాచారంలోని పారిశ్రామికప్రాంత మురుగునీటి సమస్యలు, కాలనీలలో వరద సమస్యలు తీరుతాయన్నా రు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ కమిషనర్ సంగీత, ఐలా చైర్మన్ మహిపాల్రెడ్డి, డీజడ్ఎం జ్యోతి, డీఈ రూప, ఏఈ రాఖేశ్, టీఆర్ఎస్ నాయకులు ముత్యంరెడ్డి, భూపాల్రెడ్డి, వెంకటరమణారెడ్డి, అశ్వత్థామరెడ్డి పాల్గొన్నారు.
చర్లపల్లి, ఆగస్టు 4 : ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని రాధిక చౌరస్తాలో ఎమ్మెల్యే పర్యటించారు. సాకేత్కు వెళ్లే రహదారిని పరిశీలించారు. రాధిక చౌరస్తా నుంచి సాకేత్కు వెళ్లే రహదారిలో నిత్యం ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే రోడ్డును అభివృద్ధి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రాధిక చౌరస్తాలో రహదారిలో ఉ న్న దివ్యాంగుడికి టీఆర్ఎస్ నాయకుడు కాసం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేశా రు. ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకునేందుకు కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్రెడ్డి, కొత్త రామారావు, డిప్యూటీ కమిషనర్ శంకరయ్య, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఈఈ కోటేశ్వర్రావు, సర్కిల్ ఏసీపీ శ్రీధర్ప్రసాద్, డీఈ బాలకృష్ణ, టీపీఎస్ సరిత, ఏఈలు సంతోష్, అభిషేక్, నాయకులు మహిపాల్రెడ్డి, మణిపాల్రెడ్డి, కృష్ణారావు, శిరీషా పాల్గొన్నారు.
కాప్రా, ఆగస్టు 4: మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. కాప్రా ఈద్గావద్ద ఉప్పల్ టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బద్రుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఎమ్మెల్యే బేతికి కేక్ తినిపించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే
గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఓల్డ్కాప్రాలో టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు బద్రుద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసే కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సుభాష్రెడ్డికి ఆయన కేక్ తినిపించారు. కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ గౌతమ్కుమార్, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ పావనీరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి పాల్గొన్నారు.