కాచిగూడ, జనవరి 30: పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని, ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని లైన్స్క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్ఎన్ రెడ్డి అన్నారు. హర్రస్పెంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయ కమిటీ, లైన్స్క్లబ్ ఆఫ్ ఇంటర్ నేషనల్, 320బీ లైన్స్క్లబ్ హైదరాబాద్ రాయల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంధులకు మేఘ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జనరల్, గైనకాలజి, 2డీ, ఈసీవో, కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి, ఉచిత వైద్య సేవలు అందించారు. వారికి మందులు, విటమిన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎన్రెడ్డి మాట్లాడుతూ అంధులు, పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలకు చేస్తున్న వైద్య సేవాలను గుర్తించి ఆలయ కమిటీ సభ్యులను లైన్స్క్లబ్ ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో రాజ్కుమార్ విగ్, వీరాస్వామి, సాయిగిరిధర్, బి.కృష్ణాగౌడ్, సత్యనారాయణ, విజయ్కుమార్, మురళీమోహన్, లైన్స్క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రాయల్ చైర్మన్ ఆకుల రవీందర్, ప్రమోద్, వైల శ్రీనివాస్రావు, డాక్టర్ కొండ శ్రీనివాస్రావు, గోపాల్రాజ్, గురుజీ మానిక్రావు, శివకుమార్, యాదయ్య పాల్గొన్నారు.