రంగారెడ్డి : జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్(Bike)ని టిప్పర్(Tipper) ఢీ కొట్టడంతో తండ్రీ కొడుకులు అక్కడికక్కడ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నాగోల్(Nagole) పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ – కుం ట్లూరు వద్ద శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు..బైక్ని టిప్పర్ ఢీ కొట్టి కొంతదూరం ఈడ్చికెళ్లింది. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలడంతో మంటలు చెలరేగి టిప్పర్, బైక్ పూర్తిగా తగలబడిపోయాయి. సమాచారచం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.