హైదరాబాద్: హైదరాబాద్లో (Hyderabad) మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి. మంగళవారం ఉదయం ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారులను హెచ్ న్యూ విభాగం అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 1,380 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి, 44 ఎల్ఎస్డీ బ్లాట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ బహిరంగా మార్కెట్లో రూ.1.4 కోట్లు ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలను మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడిస్తారని అధికారులు తెలిపారు.