నాంపల్లి క్రిమినల్ కోర్ట్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): ఓ వ్యాపార సంస్థ నుం చి లంచం డిమాండ్ చేసిన కేసులో ఇద్దరు కమర్షియల్ టాక్స్ అధికారులకు ఏసీబీ కో ర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. వీరాంజనేయ ఏజెన్సీ, అగ్రి బిజినెస్ సెంటర్కు సంబంధించిన టిన్ సమస్యను పరిష్కరిం చి సీ ఫారమ్ ఇవ్వాల్సిందిగా నాగరాజు అనే వ్యక్తి హైదరాబాద్ కమర్షియల్ టాక్స్ అధికారులను సంప్రదించాడు.
ఇందుకు రూ.3000/-లు లంచం ఇవ్వాల్సిందిగా టాక్స్ అధికారి యాదాడి రాజు, అసిస్టెం ట్ శంకర్ రెడ్డి డిమాండ్ చేయడంతో నాగరాజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా రు. లంచం ఇస్తుండగా ఇద్దరిని రెడ్ హ్యాం డెడ్గా పట్టుకొని రిమాండ్కు తరలించారు.