సత్తుపల్లి రూరల్, జూన్ 14: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ముళ్లపూడి నియోగి (60) సోమవారం అనారోగ్యంతో హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. నియోగి ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ముళ్లపూడి కామేశ్వరరావు కుమారుడు. ఈయన రచించిన ‘ఆర్తి, వల్లడి, నెగళ్లు’ రచనలు రాజారామ్మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేషన్కు ఎంపికయ్యాయి. తెలంగాణ ఉద్యమంపై రచించిన ‘కొలిమి’ కవితా సంకలనాన్ని 2014లో ఖమ్మంలో జరిగిన ‘కదన భేరి’ సభలో కేసీఆర్ ఆవిష్కరించారు. సుదీర్ఘకాలం పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్లోనే పూర్తిచేశారు.