కీసర, జూన్ 7 : మిషన్ కాకతీయ కింద చెరువులను అభివృద్ధి చేసి, సాగు విస్తీర్ణం పెంచి.. రైతుల ముఖంలో ఆనందం నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం కీసర మండలం చీర్యాల్లోని ఎంఎల్ఎన్ ఫంక్షన్హాల్లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ముందు ఉన్న నాట్కాన్ చెరువులో మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 46,500 చెరువుల్లో మిషన్ కాకతీయ కింద పూడికతీత పనులు చేపట్టి ఎంతో అభివృద్ధి చేశామని, నేడు మే, జూన్లో కూడా చెరువులు నీటితో నిండుకుండలా ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ రాకముందు చెరువులు, తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మన కళ్లముందు కనబడుతుందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీటిని సరఫరా చేస్తున్న ఘనత మన కేసీఆర్కే దక్కిందన్నారు. చెరువులను కాపాడే బాధ్యత ఇరిగేషన్ శాఖ అధికారులదేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జితేందర్రెడ్డి, మండల తాసీల్దార్ గౌరివత్సల, ఏఈ ప్రశాంత్కుమార్, ఇరిగేషన్ అధికారులు వాసు, పరమేశ్, నిఖిత, సర్పంచ్లు తుంగ ధర్మేందర్, నాయకపు మాధురి వెంకటేశ్, కౌకట్ల గోపాల్రెడ్డి, ఆకిటి మహేందర్రెడ్డి, పిడిచుట్టి పెంటయ్య, పుట్ట రాజుముదిరాజ్, ఎంపీటీసీలు తటాకం నారాయణశర్మ, జూపల్లి వెంకటేశ్, పండుగ కవితశశికాంత్, మండల కో-ఆప్షన్ సభ్యులు బషారత్అలీ, బీఆర్ఎస్ నేతలు జలాల్పురం సుధాకర్రెడ్డి, కందాడి శ్రీకాంత్రెడ్డి, పి.శ్రీనివాస్, శివలింగాల శ్రీనివాస్గౌడ్, కోల విజయకుమార్, రామిడి రాంరెడ్డి, తటాకం భానుశర్మ, రాము, తదితరులు పాల్గొన్నారు.