హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జిరిగాయి. మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పద్మారావు నగర్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 21 కిలోల కేక్ ను మంత్రి KTR కట్ చేశారు. కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, MLA దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.