తిరిగి అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
సుల్తాన్బజార్, జూలై 28: రహదారులపై ట్రాఫిక్కు అంత రాయం కలిగించే విధంగా పార్క్ చేస్తున్న వాహనదారులను కట్టడి చేసేందుకుగాను క్లాంప్ విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నామని సుల్తాన్బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.సుమన్ కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం సుల్తాన్బజార్ పరిధిలో వాణిజ్య కూడలిలలో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదాలకు కారణమయ్యే విధంగా పార్క్ చేసిన వాహనాలను గుర్తించి ఆయన సమక్షంలో పోలీసులు క్లాంప్లను బిగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జంట నగరాలలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా క్లాంప్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టడం జరిగిందని, రోడ్డుపై ఇతరులకు ఇబ్బందులకు గురి చేసేలా వాహనాలు నిలిపితే చర్యలు తప్ప వన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిం చాలని ఆయన సూచించారు.