సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్తో మలక్పేట యశోధ దవాఖాన నుంచి సికింద్రాబాద్ కిమ్స్కు లైవ్ అర్గాన్ (ఊపిరితిత్తులు) అంబులెన్స్లో 13నిమిషాల్లో తరలించారని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
11 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుందన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 23సార్లు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయా దవాఖానల యాజమాన్యాలు పోలీసులకు ధన్యవాదాలు తెలిపాయి.