TJF Silver Jubilee | ఖైరతాబాద్, మే 30 : హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని జలవిహార్ వేదికగా నేడు జరుగనున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ మేరకు శుక్రవారం టీజేఎఫ్ వ్యవస్థాపకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యులు ఎ. రమణ కుమార్, టీయుడబ్ల్యుజే రాష్ట్ర కోశాధికారి యోగానంద్, సహాయ కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్తోకలిసి పరిశీలించారు. సభా నిర్వహణ ప్రధాన ప్రాంగణం, వేదిక, భోజన ఏర్పాట్లును పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అల్లం నారాయణ సూచించారు.