హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ (Deputy Mayor)మోతె శ్రీలత శోభన్రెడ్డి (Srilatha Reddy), బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దంపతులు బుధవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యుల పేర్లపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావాలని, దేశరాజకీయాల్లో బీఆర్ఎస్ జెండా (BRS Flag)ఎగురవేయాలని వారు స్వామిని వేడుకున్నారు.