సికింద్రాబాద్, ఫిబ్రవరి 11: నగర డిప్యూటీ మేయర్గా మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోతె శ్రీలతాశోభన్రెడ్డికి బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ తనను ప్రోత్సహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, సహకరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒకరికీ, నగర ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. అలాగే కొత్త ప్రభుత్వానికి అని విధాలా సహకరిస్తానన్నారు.