హైదరాబాద్: బంజారాహిల్స్ కారు ప్రమాదం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల కింద బంజారాహిల్స్లో కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో అతివేగంగా కారును నడిపి నిందితులు ఇద్దరి ప్రాణాలను తీశారు. వెంటనే కారును నడిపిన రోహిత్తో పాటు కారులో ఉన్న సాయిసుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు నిందితులు తెలపడంతో.. మరో నిందితుడు వెంకటేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్, అల్కాపురి కాలనీలో వెంకటేశ్ కన్స్ట్రక్షన్ యజమానిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.