పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటయ్య వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మంజుల (19) గత 5 నెలల నుంచి ఏయిర్పోర్డులో ఉద్యోగం చేస్తుంది.
ఈ నెల 5న ఉదయం 7 గంటలకు రోజు మాదిరిగానే డ్యూటీకి వెళ్లింది. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఆమె కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోయేసరికి ఆదివారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.