చాంద్రాయణగుట్ట : ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఆదివారం ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం..బాబానగర్కు చెందిన ముస్రత్ అన్సారీ (24), తన ఇద్దరు పిల్లలు సయ్యదా జైనా ఫాతిమా (5), సయ్యదా జోహా ఫాతిమాలతో కలిసి అదృశ్యం అయింది.
ఈ నెల 21న మధ్యాహ్నం ముస్రత్ అన్సారీ ఆడపడుచు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో సోదరుడు సయ్యద్ సముయుద్దీన్కు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంటనే సముయుద్దీన్ ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో భార్య,ఇద్దరు పిల్లలు కనిపించలేదు.
మరోసారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.