జూబ్లీహిల్స్, జనవరి 13 : యూసుఫ్గూడ కోట్లవిజయభాస్కర్రెడ్డి(కేవీబీఆర్) ఇండోర్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ‘ఫస్ట్ బిషన్ సింగ్జీ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ’ శనివారం ముగియనున్నది. దేశంలోని 19 రాష్ర్టాలతోపాటు యూఎస్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా నుంచి 495 మంది క్రీడాకారులతోపాటు గ్రాండ్ మాస్టర్(ఐసీఎఫ్, తమిళనాడు) ఆర్ఆర్ లక్ష్మణ్తోపాటు పలువురు ఇంటర్నేషనల్ మాస్టర్స్, మల్టీపుల్ నేషనల్ చాంపియన్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 129 ట్రోపీలు, 79 నగదు బహుమతులతోపాటు విజేతలకు రూ.10లక్షల విలువైన బహుమతులు అందజేయనున్నారు. ఈ పోటీలను వీ 4 చెస్ ట్రస్ట్ ప్రతినిధులు రాము కంది, రిషిపాల్ సింగ్, అమిత్పాల్ సింగ్, బినీష్ భాటియా పర్యవేక్షిస్తున్నారు. ముగింపులో కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని నిర్వాహకులు తెలిపారు.