నేరేడ్మెట్, మార్చి 2 : తప్పిపోయిన బాలుడిని రెండు గంటల్లోనే పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎ.నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ డిఫెన్స్కాలనీకి చెందిన బాలుడు డీఏవీ పబ్లిక్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఇంటిముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించక పోవడంతో నేరేడ్మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీఐ ఎ.నర్సింహస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో వేంకటేశ్వరనగర్లో బాలుడు దొరికాడు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ చెప్పారు. ఫిర్యాదు అందిన 2 గంటల్లోపే బాలుడి ఆచూకీ లభ్యం కావడంతో మల్కాజిగిరి డీసీపీ జానకి ధరావత్ సీఐ నర్సింహస్వామి బృందాన్ని అభినందించారు.