మెహిదీపట్నం, డిసెంబర్ 8 : మీడియా రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న జర్నలిస్ట్లకు హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో హైబిజ్ మీడియా అవార్డ్స్ – 2022ను అందించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మాసబ్ట్యాంక్ హోటల్ గోల్కొండలో అవార్డుల ప్రదానోత్సవ పోస్టర్ను ఆవిష్కరించి, వివరాలు వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఎఫ్ఎం రేడియో విభాగాల్లో సేవలు అందచేస్తున్న వారిలో ఉత్తమ సేవలను అందించిన వారిని గుర్తించి జనవరి 29న గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు హైబిజ్ టీవీ ఎండీ మాడిశెట్టి రాజ్గోపాల్ తెలిపారు. ఆసక్తి ఉన్న జర్నలిస్ట్లు జనవరి 17 వ తేదీ వరకు www.hybiz.tv/awards లింక్లో ద్వారా నామినేషన్లు అందచేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ప్రెసిడెంట్ అనిల్కుమార్, హిందూ పత్రిక మాజీ రీజనల్ జనరల్ మేనేజర్ రంగారెడ్డి, ది హిందూ మాజీ అసోసియేట్ ఎడిటర్, చీఫ్ బ్యూరో సోమశేఖర్, ఇన్షియేటివ్ మీడియా మాజీ బిజినెస్ డైరెక్టర్ సత్యనారాయణ, సాక్షి అడ్వర్టైజ్మెంట్ మాజీ జనరల్ మేనేజర్ రమణ కుమార్ పాల్గొన్నారు.