సుల్తాన్బజార్,డిసెంబర్ 27. దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర కుటుంబ, సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. మంగళవారం కింగ్కోఠి జిల్లా దవాఖానలో భగవాన్ మహవీర్ దివ్యాంగ సహాయత సమితి సంస్థ ప్రధాన అధ్యక్షుడు పీసీ పారఖ్ ఆధ్వర్యంలో ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్తో కలిసి దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహవీర్ సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో క్యాంపులను నిర్వహించి అవసరమైన వారిని గుర్తించి కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు ఉచితంగా అందజేయడం అభినందనీయమని అన్నారు.
ప్రభుత్వం తరఫున దివ్యాంగులకు ప్రతి ఏడాది వీల్చైర్స్ అందిస్తున్నామని అన్నారు. కృత్రిమ అవయవాల అవసరం ఉన్న వారు కింగ్కోఠి జిల్లా దవాఖాన ఆవరణలోని మహవీర్ దివ్యాంగ సహాయతా సమితి సభ్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లోర్ చైర్పర్సన్ సుభ్రమహేశ్వరి,సెక్రటరీ గుంజన్ సింథీ, సభ్యులు సుజని,రాధికా శ్రీరామ్, నాంథారావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ షహీదా బేగం తదితరులు పాల్గొన్నారు.