మహేశ్వరం : దళితుల సాధికారత కోసమే దళితబంధు పథకం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో దళితబంధు లబ్దిదారుల అవగాహన కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ప్రతి ఒక్క దళిత కుటుంబం అన్ని రంగాలలో ఆర్ధికంగా బలపడాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని ఆమె అన్నారు. దళితుల జీవితాలలో వెలుగులు నింపుతూ సామాజిక అసమానతలు రూపుమాపడానికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆమె అన్నారు. ప్రతి నియోజక వర్గంలో 100 మంది లబ్దిదారులకు దళితబంధు పథకం అందిస్తామని ఆమె అన్నారు.
దీనిద్వారా 17 లక్షల కుటుంబాలకు రాష్ట్రంలో లబ్ది చేకూరుతుందని ఆమె అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 698 మందికి 17 కోట్ల 75 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని ఆమె అన్నారు. జిల్లాలో 18 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని ఆమె అన్నారు. 1 లక్ష 70 వేల కోట్లు దళితబంధుకు కేటాయించిన సీఎం కేసీఆర్ గొప్ప ధైర్యశాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్రెడ్డి, వ్యవసాయాధికారి గీతారెడ్డి, దళితబంధు ప్రత్యేకాధికారి ఓంప్రకాష్, జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి రఘునందన్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్కుమార్, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, జిల్లా ఉద్యానవన అధికారి సునంద టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు అంగోతు రాజునాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూనయాదయ్యతో పాటు దళిత బంధు లబ్దిదారులు పాల్గొన్నారు.