సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో తలమానికంగా నిలుస్తున్న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనం త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15లోగా ఈ భవన నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ శనివారం బంజారాహిల్స్లోని సీసీసీని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డితో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్, టెక్నికల్ కమిటీలతో చర్చించి ఓ ప్రత్యేక ప్రణాళిక ద్వారా పనులన్నింటినీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ఎన్.వీ.రమణరావు, హెచ్ఎంఆర్ఎల్ ఎస్ఈ అప్పారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.