బంజారాహిల్స్,ఆగస్టు 12: ఉమ్మడి ఆస్తిని అమ్మాలంటూ ఒత్తిడి చేయడంతో పాటు తమ్ముడిని చంపేందుకు యత్నించిన రౌడీషీటర్పై బంజారాహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడలోని ఎల్ఎన్నగర్కు చెందిన అడ్డునూరి లక్ష్మణ్ (47) పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. కాగా ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇంటిని అమ్మేయాలంటూ గత కొంతకాలంగా తమ్ముడు మహేష్పై ఒత్తిడి తెస్తున్నాడు.
దానికి అతడు అంగీకరించకపోవడం కక్ష పెంచుకున్న లక్ష్మణ్ బుధవారం సాయంత్రం తమ్ముడి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడంతో పాటు గొడవకు దిగడంతో పాటు అతడి గొంతు పిసుకుతూ చంపేందుకు యత్నించాడు. దాంతో మహేష్ భార్య శ్రీలత అక్కడకు వచ్చి అపేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేయడంతో పాటు ఒంటిపై అసభ్యంగా తాకుతూ తోసేశాడు.
ఈ మేరకు బాధితుడు మహేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు లక్ష్మణ్పై ఐపీసీ 307,354(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.