బడంగ్పేట, జనవరి 5: మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. చెరువుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి రోడ్లకు అడ్డంగా వేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువులో నుంచి తీసిన చెత్త, పెద్ద పెద్ద మట్ట దిబ్బలు రోడ్డుపై పోసి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటివరకు తొలగించడం లేదని.. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఇరుకు రోడ్డు.. ఆపై శ్మశాన వాటిక పక్కన ఉంది. అదే రోడ్డుపై చెరువులోంచి తీసిన చెత్త, కళేబరాలతో కూడిన వ్యర్థాలు రోడ్డుపై వేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు, వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువులో తీసిన పూడికను హెచ్ఎండీఏ అధికారులు రోడ్డుపై పోశారు. చెత్తను నాగోల్కు తరలిస్తున్నాం.. కానీ చెత్తతో పాటు మట్టి దిబ్బలు తరలిస్తే అక్కడి అధికారులు అడ్డుకుంటున్నారు. విషయాన్ని డీఈ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తాం. రోడ్లపై చెత్తవేయకుండా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీచేశాం.
– కమిషనర్ వాణి రెడ్డి