రవీంద్రభారతి,అక్టోబర్ 19: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కరుగంటి కళాక్షేత్రం ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ధూంధాంగా దసరా సంబురాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కురుగంటి కళాక్షేత్రం ఆధ్వర్యంలో దసరా సంబురాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం నాట్య గురువులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకర్షించాయి. కార్యక్రమంలో సాహితీవేత్త కావూరి శ్రీనివాస్, మహాత్మాగాంధీ డెంటల్ కాలేజీ డీన్ డాక్టర్ వెంకటేశ్వరావు, హనీఫుడ్స్ మహేశ్వరరావు, ఆధ్యాత్మికవేత్త తంగిరాల నరేష్, ఉజ్వల సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు లక్ష్మి , తమన్నా చారిబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు రాధిక పాల్గొన్నారు.