బేగంపేట్, జూలై 23: అరుదైన క్యాన్సర్తో పాటు కరోనా బారిన పడిన ఓ యువకుడికి సంక్షిష్ట శస్త్ర చికిత్సలు చేసిన కిమ్స్ వైద్యులు ప్రాణాలు కాపాడాడు. శుక్రవారం కిమ్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ హెమటో-అంకాలజిస్ట్ అండ్ స్టెమ్సెల్/ బోన్ మజ్జ మార్పిడి నిపుణుడు డాక్టర్ నరేందర్ కుమార్ తోట వివరాలు వెల్లడించాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన రాజ్కుమార్ కొచ్చెర్ల (24) గత సంవత్సరం జూన్లో క్యాన్సర్ లక్షణాలతో వైద్యశాలకు వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు అరుదైన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించి వైద్యం చేస్తున్న దశలో కరోనా బారిన పడ్డాడు. చాలా రోజులు వెంటిలేటర్పై చికిత్స పొంది ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు. అంతేకాక క్యాన్సర్కు కీమో ధెరపీ చేయించుకొని లుకేమియా సర్జరీ చేయించుకునే స్థితికి వచ్చాడు. అతడి మేనమామ నుంచి మజ్జ తీసుకొని ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేయగా క్యాన్సర్ నుంచి కోలుకున్నాడని డాక్టర్ నరేందర్కుమార్ తెలిపారు.